ఆదర్శ దాంపత్యం

*
రంగా రావు , రమణి దంపతుల వివాహం జరిగి యాభై ఏళ్ళు . వారి సంతానం , మనుమలు
మనుమరాళ్ళు అందరు కలిసి గొప్ప విందు ఏర్పాటు చేసారు ఆ సందర్భం లో .

ఆ విందులో "అదేదోటీవీ" యాంకర్ సురేఖ కూడా పాలుపంచుకుంది. రంగారావు దంపతులతో
ఇంటర్వ్యు ముందుగా రమణి గారిని ప్రశ్నించటం తో మొదలుపెట్టింది .

" రమణి గారూ , ముందుగా మీఇద్దరికీ నా అభినందనలు .యాభై ఏళ్ల కాలం భార్యాభర్తలుగా
ఆనందంగా,చిలకా గోరింకల్లాగా, ఇతరులకు ఈర్ష కలిగించేట్టు, చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా
కలిసి జీవించిన మీకు నా శతకోటి వందనాలు .మీరు ఏమీ అనుకోనంటే నాదో చిన్నప్రశ్న "

" అడుగమ్మా "

" మీరెప్పుడైనా ఈ యాభై ఏళ్ల కాలంలో , మీ వారికి విడాకులు ఇద్దామనుకున్నారా ? "

" లేదమ్మా , అలాంటి ఆలోచనే ఎప్పుడూ నా మనసులోకి రాలేదు.కానీ ఒక్క సారి మాత్రం
ఆయన్ని కాల్చిపారేద్దామనుకున్నా "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం