సందేహం

*
తల్లి మల్లికతో కలిసి తిరుమలరాయుడి గుడికి వెళ్ళాడు చిన్నికృష్ణ.వెంకటాచలపతిని దర్శించారు.
ప్రసాదాన్ని పుచ్చుకొన్నారు .

గుడి ఆవరణ లో పురాణ ప్రవచన భీమ "శంకరవోలు చినసుబ్బారావు " గారి ప్రసంగం గంగా
ప్రవాహం లా సాగుతోంది,

"నాయనలారా ! భగవంతుని సృష్టి చాలా విచిత్ర మైనది .ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు
పిల్లలూ ఒకేలా ఉండరు .ఒకరు దొంగ అవుతారు .ఉంకొకరు జడ్జ్ అవుతారు "
అని ఒక్క క్షణం ఊపిరి తీసుకోవటానికి ఆగారు

ఖాళీలో వింటున్న చిన్నికృష్ణ లేచి నిలబడి తన సందేహం వెలిబుచ్చాడు ,

"ఏమండీ ,మరి జడ్జ్ గారు, తన అన్నకి శిక్ష వేస్తారా , వెయ్యరా ? "

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం