దేవుడు చూస్తున్నాడు

నిత్యానంద యోగ సభ వారు కొత్తగా చేరిన యువ సన్యాసులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం వారందరికీ ఒక పెద్ద మర్రిచెట్టు కింద భోజనాల ఏర్పాటు .యువ సన్యాసులందరూ
ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా కదులుతూ అక్కడ ఉన్న పండ్లు, పచ్చి కూరలు,కందమూలాలు
తీసుకొని తింటున్నారు. మామిడి పళ్ళ బుట్ట దగ్గర ఇలా రాసి ఉంది

" ఒక్కరికి ఒక మామిడి పండు మాత్రమే,దేవుడు చూస్తున్నాడు ".

అది చూసి సదానందుడు, భోగానందునితో

" మిత్రమా ! ఆపిల్ పళ్ళు చెరో పది అందుకో.మామిడి పళ్ళు మాత్రం రెండే తీసుకో.

దేవుడు వాటినే చూస్తున్నాడు "