ప్రశ్నలు

*
హరి వాళ్ల నాన్న తో కలిసి , ఓ రోజు సాయంత్రం వంతెన పై నడిచి వెళుతున్నాడు .ఇంతలో
వర్షం కురవటం మొదలు పెట్టింది . పడుతున్న వాన ని చూస్తూ హరి అడిగాడు ,

" నాన్నా , మబ్బులు ఎలా వస్తాయి ? "

" ఏమోరా , నాకు తెలీదు "

ఒక నిమిషం ఆగి హరి మళ్ళీ ప్రశ్నించాడు ,

" ఆకాశం ఎందుకు నీలం గా ఉంది "

" ఏమోరా , నాకు తెలీదు "

" ఎవరూ పట్టుకోకుండా ఆకాశం లో మబ్బులు కింద ఎందుకు పడట్లేదు ? "

" నాకు తెలీదు " కొద్ది విసుగ్గా చెప్పాడు నాన్న .

" ఇంద్ర ధనుస్సు లో ఏడు రంగులు ఎందుకు ఉంటాయి "

" నాకు తెలీదు అని చెప్పానా " విసుగు పెరిగింది తండ్రికి.

గమనించిన హరి మొహం చిన్న బోయింది .తండ్రి తో అన్నాడు నెమ్మదిగా ,

" నాన్నా , నా ప్రశ్నలతో మీకు విసుగు పుడుతోందా ? "

తండ్రి హరి ని దగ్గరకు తీసుకొని చెప్పాడు అనునయంగా ,

" లేదురా కన్నా , ఏ ప్రశ్నలు వేయకుండా నువ్వు జ్ఞానం ఎలా పెంచుకోగలవు,నువ్వు

ప్రశ్నలు అడగటం ఎప్పుడూ మానకు "

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం