ఇరవై

*
మాకు రోజూ ఉదయాన్నే ఐదుగంటల కల్లా , వానలు రానీ,తుఫాను రానీ, మంచు కురవనీ
" తెలుగు వెలుగు " దిన పత్రిక వచ్చే తీరుతుంది , పేపర్ బాయ్ శీను దయవల్ల .వాడు
ఈ రోజు పేపర్ బిల్లు కట్టమని వచ్చాడు . బిల్లు కట్టించుకొని చెప్పాడు ,

" సార్ మీ లాంటి కస్టమర్లు నాకు ఓ పాతిక మంది ఉంటే చాలు సార్ .నేనెంతో ఖుషీ
అయిపోతాను "

"నా వల్ల ఏం ఉపయోగం నీకు ?, నేనెప్పుడు నీకు టీ తాగటానికి కూడా డబ్బులివ్వలేదు .
అందునా బిల్లు నెల చివరలో కడతాను "

" మీ లాంటి వారు నాకు 300 మంది ఉన్నారు సార్ నాకు,అందుకే ..... " విషయం చెప్పాడు శీను .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం