రుద్రాక్షలు

*
నరసింహారావుకు రెండేళ్ళలో ఉద్యోగవిరమణ.అతనికి రామలక్ష్మితో పెళ్లై 40 ఏళ్ళు దాటింది.
తను డబ్బు దుబారా చేసే మనిషి కావటం తో ,జీతం రాళ్ళు అన్నీ భార్య చేతిలో పోసేవాడు .
ఆమె జాగర్త చేసేది .రూపాయి కావాలన్నా ఆమెని అడిగి తీసుకునేవాడు .

ఒకసారి ,

భర్త బయట ఊరు వెళ్ళినప్పుడు , అవసరపడి అతని అలమారా వెతికింది రామలక్ష్మి .
కావలసింది దొరికింది . దానితో పాటు ఒక డబ్బు సంచీ దొరికింది .దానిలో ఆమెకి
నలభై వేల రూపాయిలు , పన్నెండు రుద్రాక్షలు కనిపించాయి .

ఆమెకి ఏమీ అర్ధం కాలేదు .ఒక్క పైసా కూడా దాచుకొని మనిషి దగ్గర నలభై వేలు
తనకు తెలీకుండా ఉండటం ,వాటితో పాటు రుద్రాక్షలు ?

ఊరు నుండీ వచ్చిన భర్త ని మంచి సమయం చూసుకొని అడిగింది ,

" ఏమండీ , మీ బీరువాలో సంచీ ఉంది , ఇది మీదేనా ,అయితే రుద్రాక్ష లు ఎందుకు
దాచారు , డబ్బు ఎక్కడిది ? "

నరసింహారావు బదులిచ్చాడు ,

" సంచీ నాదే , నువ్వు క్షమిస్తానంటే నిజం చెబుతాను .మన పెళ్లి అయినప్పటి నుండీ
నేను నీతో అబద్ధం చెప్పినపుడల్లా ఒక రుద్రాక్షని సంచీలో వేసేవాడిని "

రామలక్ష్మి ఒక్క క్షణం బాధపడింది .తరువాత నలభై ఏళ్ల కాపురం లో భర్త తనతో
ఆడింది పన్నెండు అబద్ధాలే కదా అని సమాధాన పడి అడిగింది ,

" మరి నలభై వేలు ? "

" నూట ఎనిమిది రుద్రాక్షల మాలలు,ఒక్కొక్కటీ వంద రూపాయలకు అమ్మితే వచ్చిన సొమ్ము
అది " నిజం పూర్తి చేసాడు నరసింహారావు

4 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం