జలుబు

*
మొన్న డిసెంబర్లో కొత్తగూడెం కుర్రాడు రాజాబాబు ని వాళ్ల ఆఫీసు వాళ్లు పని మీదా కాశ్మీర్
పంపించారు .

అలా కాశ్మీర్లో దిగాడో లేదో ,పడిశం ఇలా వచ్చి ముక్కు పట్టేసింది . ముక్కు దిబ్బడేసి
గాలి కూడా ఆడటం లేదు . వెంటనే వెళ్లి డాక్టర్ క్రిషేన్ కౌల్ ని కలిసాడు .

ఆయన మందిచ్చారు .తగ్గలేదు .రాజాబాబు మరునాడు మళ్ళీ దర్శించాడు ,
వేరే మందు రాసి ఇచ్చాడు . అయినా ఉపయోగం లేదు .ముచ్చటగా మూడో రోజు
డాక్టర్ గారు ఏదో పసరు ముక్కు మీద పోసి మర్దన చేసాడు .అయినా ఏమీ మార్పు లేదు.
డాక్టర్ కాసేపు ఆలోచించి చెప్పాడు ,

"నువ్వు వెంటనే వెళ్లి బాగా సలసలా కాగిన వేడి నీళ్ళతో స్థానం చేసి ,ఒళ్ళు తుడుచు
కోకుండా అలాగే గది లోకి వచ్చి పూర్తి వేగం తో ఫ్యాను వేసుకొని , అన్ని కిటికీలు , తలుపులు
పూర్తిగా తీసి , ఓ పది నిమిషాలు నిలబడు "

" సార్ , అలా చేస్తే నేను న్యుమోనియా వచ్చి చచ్చిపోతాను " భయం గా, ఆందోళన తో అన్నాడు

రాజబాబు .

" ఏం పర్లేదోయ్,నాకు ఈ జిల్లా లోనే న్యుమోనియా బాగా తగ్గిస్తానని బాగా పేరు" ధైర్యం
చెప్పాడు క్రిషేన్ కౌల్ .

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం