అభిప్రాయం

*
బాపట్లలో అగ్రికల్చర్ బి.యస్సీ చదువుతున్న అరుణ , గీత , హరిణి , సుభాషిణి స్టడీ టూర్
కోసం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వెళ్ళారు .అక్కడ వారికి గైడ్ గా కుర్ర ప్రొఫెసర్ దేవానంద్
ని నియమించారు .

అమ్మాయిల స్టడీ టూర్ నెల రోజుల పాటు మూడు పొలాలు , ఆరు పంటలుగా సాగింది .వారు
బాపట్ల తిరిగి వచ్చే రోజు ,ప్రొఫెసర్ వారికోసం హోటల్ లో విందు ఇచ్చాడు .అమ్మాయిలు
అతన్ని "మా నలుగురి గురించి మీ అభిప్రాయం ఏమిటి " అని అడిగారు .

దేవానంద్ అన్నారు ,

"సుభాషిణీ ! నువ్వు బాగా కష్టపడి పనిచేస్తావు "

" గీతా ! నువ్వు చాలా తెలివైన దానివి "

"అరుణ మంచి చురుకైనది "

" హరిణీ ! నువ్వు మంచి మాటకారివి "

అమ్మాయిలు ధన్యవాదాలు చెప్పి అడిగారు ,

"మీ గురించి మీ అభిప్రాయమేమిటి ? "

" నేను ఒట్టి అబద్దాలకోరుని "

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం