*
ఓ ముఖ్యమంత్రి గారు, మేధావుల సభలో ప్రారంభోపన్యాసాన్ని ఇస్తున్నారు .వారి వాగ్ధాటి
ఆగకుండా సాగిపోతూనే ఉంది . ఇంతలో హఠాత్తుగా "పచ్చినిజం " దినపత్రిక విలేఖరి లేచి
ముఖ్యమంత్రి ని వేలెత్తి చూపుతూ " నువ్వొట్టి చవట దద్దమ్మ వి " అని అరిచాడు .
వెంటనే ఈ విషయం మన గొప్ప మీడియా ద్వారా ప్రపంచమంతా ప్రసారమయ్యింది
పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు . జడ్జ్ గారు విచారించి
లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
పాపం విలేఖరి జడ్జ్ గారిని ప్రాధేయపడుతూ అడిగాడు ,
" చిన్న పొరపాటు మాటకి లక్ష రూపాయల జరిమానానా సార్ "
జడ్జ్ చెప్పారు ,
" నువ్వన్న మాటకి జరిమానా పదివేలే .కానీ కాపాడ వలసిన రహస్యాన్ని ప్రపంచానికి
బయట పెట్టినందుకు మిగతా తొంభై వేలు "
హ. హ. హ.. దినపత్రిక పేరు బావుంది.. పచ్చి నిజం..
రిప్లయితొలగించండిsimly superb
రిప్లయితొలగించండిgood one
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిsuperb :)))
రిప్లయితొలగించండి