ఆరోపణ

*
నీటిపారుదల శాఖలో ఎప్పటిలాగే ప్రాజెక్ట్ ల విషయం లో అవినీతి వరదలైపారుతోంది. బొత్తిగా

అనుభవంలేని ఒకడు పొరపాటున దొరికిపోయాడు . తనని కాపాడమని ప్రధాన
కార్య నిర్వాహణాధికారి మధుసూధన్ ని కలిసి కొంత సమర్పించుకున్నాడు . అందరి ఖర్మ
కాలి ఈ విషయం ప్రత్యేక కోర్టు లో విచారణ జరుగుతోంది ,

ప్రభుత్వం తరుఫున లాయర్ ,మధుసూధన్ ని ప్రశ్నించాడు ,

"కేసు మాఫీ చేయటానికి మీరు ఇరయై లక్షలు తీసుకుంది నిజమేనా ? "

మధుసూధన్ నుండీ సమాధానం లేదు .అతను కిటికీ లో నుండీ బయటకు చూస్తున్నాడు .

" మీరు కేసు మాఫీ చేయటానికి ఇరయై లక్షలు తీసుకున్నది నిజమేనా ? " మళ్ళీ
అడిగాడు లాయర్ . సమాధానం లేదు .

అప్పుడు జడ్జ్ గారు,

"మధుసూదన్ ! మీరు ఇరయై లక్షలు తీసుకోన్నారా ? " అని అడిగారు ,కొంచెం అతనివైపు
వంగి

మధు ఉలిక్కిపడి ,

" జడ్జ్ గారూ! లాయరు అడిగేది మిమ్మల్ని కాదా ? " అన్నాడు

5 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం