పరువు

*
భిక్షపతి,కుబేరరావుల మధ్య శత్రుత్వం వారసత్వం గా వచ్చింది మూడు తరాలుగా .ఎదుటి వాడ్ని
వెధవని చేసే అవకాశం , ఏ చిన్నది దొరికినా ఎవరూవదిలేవారు కాదు .

ఒకరోజు కుబేరరావు మిత్రుడు గంగరాజు తో,ఆవేశంతో వూగిపోతు కోపంతో జేపురించిన మొహంతో
అన్నాడు ,

"ఆ త్రాస్టుడు భిక్షపతి మొన్న పది మందిలో నా పరువు మొత్తం గంగలో కలిపాడు.వాడు నా
కళ్ళకి జీవితం లో మళ్ళీ కనిపించటానికి వీల్లేదు "

"మరి మన ఆస్థాన గూండా వినయ్ కి కబురు చెయ్యనా ? "

"అక్కరలేదు,నేనే వాడికి కనపడకుండా ఊరొదిలి వెళ్ళిపోతున్నాను"చెప్పాడు కుబేర రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం