మానవ వనరులు

*
కాంతిమతి గోవిందా ఇండస్ట్రీస్ లో మానవ వనరుల విభాగానికి మేనేజర్ గా పనిచేస్తోంది .

భూమి మీద నూకలు చెల్లి , ఒక యాక్సిడెంట్ లో హఠాత్తుగా ఆవిడ ప్రాణాలు పోయాయి .

ఆమె ఆత్మ పైకి వెళుతుంటే స్వర్గం-నరకంల మధ్య ఉన్నగేటు దగ్గర ఓ దేవదూత ఆపి చెప్పాడు,

"అమ్మా ! మీరు చేసిన పాప పుణ్యాల ననుసరించి స్వర్గ సుఖాలను , నరక యాతనలను

రెండింటిని అనుభవించాలి .మీరు ముందు ఎక్కడకు వెళతారో ఎన్నిక చేసుకోవచ్చు .

దానికి ముందు మీరు స్వర్గం , నరకం రెంటిలోనూ ఒక్కోరోజు గడపాలి "

కాంతిమతి ముందు నరకం చూస్తానంది. యమభటులు వచ్చి ఆమెను సాదరంగా

నరకానికి తీసుకెళ్ళారు .

నరకంలో , ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది .చాలా శుభ్రం గా ఉంది .

బాగా అలంకరించబడి ఉంది . ఆమె రాగానే పూర్వం ఆమెతో కలిసి పని చేసిన వారు ,

ఆమె పాత బాసులు ఘన స్వాగతం పలికారు . చక్కటి భోజనం పెట్టారు . ఆటా -పాటా

బాగా సాగింది . కాంతిమతి రోజల్లా ఆ సంబరాల్లో మునిగిపోయింది .

తరువాత రోజు ఉదయాన్నే , యమభటులు ఆమెను స్వర్గం లో ప్రవేశ పెట్టారు .

స్వర్గం చాలా ప్రశాంతం గా ఉంది ,ఆహ్లాదం గా ఉంది .రోజు ఎలా గడిచిందో తెలియలేదు .

పక్కరోజు ఉదయాన్నే దేవదూత అడిగాడు ,

" మీరు ఎక్కడికి ముందు వెళతారు "

కాంతిమతి ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది ,

" నేను ముందు నరకానికే వెళతాను ,నా వాళ్లందరూ నా గురించి ఎదురు చూస్తుంటారు "

ఆమెని నరకానికి పంపారు ,

అడుగు పెడుతూనే భరించరాని దుర్గంధం,అంతా కుళ్ళిన చెత్త ,మనుషులంతా మహా మడ్డిగా

ఉన్నారు.

కాంతిమతి బుర్ర తిరిగిపోయింది .అక్కడ తనకు తెలిసిన వారిలో పెద్ద వారిని అడిగింది ,ఏమిటీ

తేడా అని . ఆ పెద్దాయన చెప్పారు ,

"మొన్న నిన్ను ఉద్యోగం లోకి తీసుకొన్నాము , ఇవాళ నువ్వు పనిలోకి వచ్చావు "

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం