లాయర్ తెలివి

*
ముద్దాయి వీరయ్య కోర్టు బోనులో నిలబడి ఉన్నాడు .ఆది శేషుని హత్య చేశాడని అతనిపై
అభియోగం .ఆదిశేషు శవం దొరకలేదు ,కానీ వీరయ్యే హత్య చేసినట్లు బలమైన సాక్ష్యాలు
ఉన్నాయి .అతని లాయర్ నిజాయతీగా వాదించి ,వీరయ్య ని నిర్దోషిగా విడుదల చేయించాలని
చూస్తున్నాడు .

ఆ రోజు చివరి వాయిదా , లాయర్ జడ్జ్ గారితో ఇలా చెప్పాడు ,

" మీరు మరణించారని భావిస్తున్న ఆదిశేషు , సరిగ్గా రెండు నిమిషాల తరువాత , తూర్పు
వైపు తలుపు ద్వారా కోర్టు లోకి వస్తాడు, దయచేసి చూడండి "

ఈ ప్రకటన విని కోర్టు లోని వారు ఒక్క సారిగా నివ్వెరపోయి , ఆదిశేషు కోసం తూర్పు
ద్వారం వంక కళ్లు ఆర్పకుండా చూడసాగారు .రెండు నిమిషాలు అయిపోయాయి .
మరో రెండు నిమిషాలు గడిచాయి . ఏమీ జరగలేదు .

జడ్జ్ గారు కోపంగా లాయర్ ని చూసి "ఏం పరాచికాలాడుతున్నావా " అన్నారు .

లాయర్ " క్షమించాలి , నేను ఆదిశేషు వస్తాడని చెప్పగానే , మీరందరూ అతనికోసం
కళ్ళప్పగించి ఎదురుచూశారు.దాని వల్ల , మీ మనస్సులో అతను బతికే ఉన్నాడని
ఏ మూలో అనుమానం ఉంది . అందుచేత మీరు ముద్దాయిని అపరాధిగా భావించ
కూడదు "

జడ్జ్ ఓ పది నిమిషాలు బాగా ఆలోచించి వీరయ్య కి ఉరి శిక్ష ఖాయం చేసారు .

లాయర్ అడిగాడు వినయంగా,

" మీరు మీ మనసు మార్చు కొనక పోవటానికి కారణం ఏమిటి ? "

" వీరయ్య తన చూపు తలుపు వైపు అసలు తిప్పనే లేదు కాబట్టి " చెప్పారు
జడ్జ్

4 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం