మృగం

*
దామోదరం , శాంతకుమారి పెళ్లి చేసుకొని ఏడు ఏళ్ళు అయ్యింది. గొడవలు ప్యాసింజర్ బండి
స్థాయి నుండి రాజధానీ ఎక్స్ ప్రెస్ స్థాయి కి పెరిగాయి .

ఒక రోజు దామోదరం , శాంతకుమారి ల మధ్య గొడవ తారా స్థాయి కి చేరుకుంది .దామోదరం
పట్టరాని కోపం తో అరిచాడు ,

"ఇన్నాళ్ళు నువ్వు నాలోని మనిషినే చూశావు .నా సహనం చచ్చి పోయింది .ఇప్పుడు నాలోని
మృగాన్ని నిద్ర లేపుతున్నావు. ఇంతకింతా అనుభవిస్తావు "

" అయినా కుందేలుకి ఎవరు భయపడతారు ? " అని చీర విదిలించుకుంటూ అక్కడ నుండీ
వాక్ అవుట్ చేసింది శాంత కుమారి .

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం