*
నాగ లోకంలో నాగ పంచమి సంబరాలు బాగా జరుగుతున్నాయి . కానీ కోడె తాచు తక్షకుడు
మాత్రం ఆనందంగా లేడు. అక్కడ జరిగేది ఏమీ అతనికి కనబడటం లేదు .క్రితం ఏడు కూడా
ఇలాగే గడిచి పోయింది .ఇన్నాళ్ళు చెప్పుకోవటానికి సిగ్గు పడి వైద్యుడి దగ్గరకి వెళ్ళలేదు .
ఇప్పుడు వెళ్ళకతప్పట్లేదు .
నాగధన్వంతరి వద్దకు వెళ్ళాడు .ఆయన కళ్లు పరీక్షించి మంచి కళ్ళద్దాలు రాసి ఇచ్చి
రెండు రోజులాగి మళ్ళీ కనపడమన్నాడు .
తక్షకుడు రెండు రోజుల తరువాత చాలా విచారంగా తల వేళ్ళాడేసుకొని వచ్చాడు .
ధన్వంతరి అడిగారు ,
"ఏమి తక్షకా ! ఏం అద్దాలు సరిగా లేవా ? "
"బాగానే ఉన్నాయి .ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నప్పటినుండీ నాకు చాలా బాధగా ఉంది "
" బాధా , ఎందుకు ? "
" నేను రెండేళ్ళ నుండీ ఓ బురద కొయ్య తో కాపురం చేస్తున్నానని తెలిసింది "
:)
రిప్లయితొలగించండి