పుచ్చకాయలు

*
ఈ ఏడాది సుబ్బయ్య పుచ్చకాయల తోట పిచ్చపిచ్చగా విరగ కాసింది .కానీ ఎంత జాగర్తగా
ఉన్నా రాత్రి పూట కాయల దొంగతనాలు ఎక్కువైయ్యాయి. కాళ్ళ గుర్తులు చూస్తే ,చిన్నపిల్లలే
దొంగలని తేలింది .

సుబ్బయ్య బాగా ఆలోచించి ,పొలంలో ఐదారు చోట్ల రంగు దీపాలు పెట్టి,వాటి కింద అట్ట మీద
హెచ్చరిక రాసి పెట్టాడు

" ఈ తోటలో ఒక పుచ్చకాయలో విషం ఎక్కించాము , జాగర్త "

"ఈ పనితో పిల్లల పని సరి " అని అనుకొని హాయిగా నిద్ర పోయాడు సుబ్బయ్య

కొత్త రోజు మొదలయ్యింది .సుబ్బయ్య రాత మారలేదు .మళ్ళీ కాయలు దొంగతనం జరిగింది
అంతే కాదు , అట్ట మీద ఈ హెచ్చరిక రాసి పెట్టి ఉంది,

" ఈ తోట లో రెండు పుచ్చకాయలు విషం తో నిండి ఉన్నాయి , జాగర్త "

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం