పీనాసి పుణ్యం

*
పాపారావు, తన ఆస్తి కాపలాకు వేరే మనిషిని పెడితే డబ్బులు ఇవ్వవలసి
వస్తుందని ,దాని కోసం బతకటానికి రోజుకో ముద్ద అన్నం తినే పరమ పీనాసి .

ఓ పిల్లకాకి,చిన్నారావు తన ఫ్రెండ్స్ తో పందెంకట్టి,శ్రీరామనవమి చందావసూలు
చేయటానికి పాపారావు ఇంటికి వెళ్ళాడు .అంతా విని పాపారావు ,

"చిన్నా ,నాకున్న కష్టాలు నీకు తెలీవు .అందుకే చందా అడిగావు .
మా అమ్మ ఆయాసం తో 10 ఏళ్ల నుండి బాధ పడుతోంది .మా నాన్నకు
పక్షవాతం .చిన్న చెల్లి పెళ్లికుంది . తమ్ముడు వ్యాపారం లో 20 లక్షలకు
దివాళా తీసాడు .వీళ్ళ అవసరాలకే రోజుకు 3 వేల రూపాయలు అవసరం "

విని కరిగాడు , కరుణ నిండిన స్వరంతో పలికాడు చిన్నారావు ,

"మీకు ఇంత డబ్బు అవసరం ఉందని నాకు తెలీదు ,ఫ్రెండ్స్ మాటలు
నమ్మి మీ దగ్గర చందా వసూలు చేస్తానని సవాలు చేశాను .నన్ను
క్షమించండి "

"బాబు చిన్నా ! తప్పుగా అర్ధం చేసుకున్నావు. అంత కష్టం లో ఉన్న నా వాళ్ళకే
పైసా కూడా విదిలించ లేదు .నీకు ఇస్తానని ఎలా వచ్చావు ? "

దాంతో చిన్నారావు చిన్న మెదడు దెబ్బతిని ,వసూలు చేసిన చందా డబ్బులు
ఆసుపత్రి ఖర్చులకు వాడుకున్నాడు .

సరైన ఆహారం తినక , పాపారావు మరణించాడు కొన్నాళ్ళకు .

మేఘాల గుండా వెళ్లి స్వర్గం తలుపు తట్టాడు .దేవదూత తలుపు తీసి
అడిగాడు

"ఎవరు నువ్వు ? , ఎందుకొచ్చావు ? "

"నేను పుణ్యం చేశాను ,స్వర్గం లోకి వెళ్ళాలి ,దారి ఇవ్వు "

"నువ్వు చేసిన పుణ్య మేమిటో " సందేహంగా అడిగాడు దేవదూత .

"ఓ బిచ్చగాడికి పది పైసలు దానం చేశాను "

" అలాగా , ఇప్పుడే కనుక్కొని వస్తాను లోపలికెళ్ళి " అంటూ తలుపేసి వెళ్ళాడు
దేవదూత.కంప్యూటర్లో చిత్ర గుప్తునితో చాట్ ఓపెన్ చేసి విషయం చెప్పాడు .

చిత్రగుప్తుడు చెప్పాడు ,

"వాడు చెప్పింది నిజమే .పది పైసలు వాడి చేతిలో పెట్టి ,వెంటనే నరకంలో
తోసేయ్ పాపిష్టి వెధవను "

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం