పరుగో పరుగు

*
కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి.మూలికల వెతుకులాట లో
అందులోకి ప్రవేశించారు ఒక సైంటిస్ట్ , ఒక స్వామీజీ .మూలిక అనుకోని
ఒక తీగను పట్టుకొని పరీక్షించసాగారు .దాంతో ఆ తీగకు చివర పొదలో
పడుకొనివున్న పులికి మెలుకువ వచ్చింది .చాలా రోజులకు నరమాంసం
దొరికిందని ఆనందిస్తూ ,వాళ్ల వెనుక పడింది .

పరుగు మొదలైయ్యింది. పరుగెడుతూనే సైంటిస్ట్ లెక్కలు వేసి, స్వామి తో
"స్వామీజీ !మనం పరుగెత్తి లాభం లేదు .పులి వేగం ఎక్కువ .మనం దానికి
ఆహారమవటం ఖాయం " అన్నాడు .

అది విని స్వామీజీ "ఆ విషయం నాకూ తెలుసు .నా ప్రయత్నమంతా
నిన్ను దాటి ముందుకు వెళ్ళాలనే "

4 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం