ఎవరు గొప్ప ?


ఆంధ్ర దేశం లో పూర్వం వీరభద్రుడు, కాళీ పుత్రుడు అనే గొప్ప మాంత్రికులు
ఉండేవారు. ప్రజలు తమ కష్టాలు పోగొట్టుకోవటానికి కాళీ పుత్రుని వద్దకు
ఎక్కువగా వెళ్ళేవాళ్ళు .అలాఅని వీరభద్రుడేమీ తక్కువ కాదు. అతని పేరు
చెబితేనే భూతాలు, దెయ్యాలు భయంతో వణుకుతూ పారిపోయేవి .

ప్రజలు కాళీ పుత్రుని ఎక్కువగా ఆదరించటానికి గల కారణాలు తెలుసుకోవాలని
వీరభద్రునికి అనిపించింది .

శాస్త్రవిషయాలలో తామిద్దరూ సమవుజ్జీలు .ఎంత ఆలోచించినా వేరే కారణాలేవీ
తెలియలేదు .ఈ విషయం కాళీపుత్రునే అడగాలని వెళ్ళాడు వీరభద్రుడు.

ప్రశ్న విని కాళీపుత్రుడు నవ్వుతూ ఇలా చెప్పాడు

"వీరభద్రా!నా కంటే నువ్వే ఎక్కువ దెయ్యాలను వదలగొట్టావు .కానీ నేను

ఒకదాన్ని కట్టుకొని ,20 ఏళ్ళ నుండీ కాపురం చేస్తున్నాను ."

వీరభద్రుడు వెంటనే దాసోహం అంటూ కాళీపుత్రుని కాళ్ళపై పడ్డాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం