ఇంద్ర-యమ సంవాదం

*
స్వర్గానికి, నరకానికి మధ్య నున్న గోడ ఓ రోజు హటాత్తుగా కూలిపోయింది.

ఇంద్రుడు ,యముడు నువ్వు కట్టాలంటే ,నువ్వు కట్టాలని వాదులాడుకున్నారు .

గొంతు బొంగురు పోయేదాకా ఒకరిపై ఒకరు నిరసన పద్యాలు పాడారు.

అయినా తేలక పోయేసరికి ఇంద్రుడు తన పక్షాన వాదించటానికి
గట్టి లాయర్ కోసం బయలుదేరాడు .

"ఎక్కడికి వెళుతున్నావు నీవు ఇంద్రా ! , వాళ్లందరూ నా నరకంలోనే ఉన్నారు "
అన్నాడు వెటకారంగా యముడు .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం