జాతి గౌరవం

*
సైంధవ దేశం వారికి తామూ గొప్ప యుద్ధ వీరులమని గర్వం .దానికి తగ్గట్టు వారు చాలా
యుద్దాలలో గెలిచారు.విశాల దేశం వారితో యుద్ధంలో వారి ఖర్మ కాలి కాలికి బుద్ది చెప్పవలసిన
అవసరం పడింది వారికి .వారు అలా వెనుతిరిగి పారిపోతుండగా , వెనకనుండీ ఉపసేనాధిపతి,
సేనాధిపతికి అరిచి చెప్పాడు ,

" నేను విశాల దేశం సైనికులను ఐదుగురిని పట్టుకున్నాను, నాకు సహాయం చేయండి "

"మంచిది , వెంటనే వాళ్ళని నా ముందుకి లాక్కోనిరా "

"వాళ్లు రావటం లేదు , నువ్వే రావాలి "

" మనం ఆగటానికి వీల్లేదు,వాళ్ళని వదిలి పెట్టి నువ్వు వచ్చేయి "

"నేను వదిలినా వాళ్లు నన్ను వదలటం లేదు " అరిచి చెప్పాడు ఉప సేనాధిపతి .

4 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం