సుఖం

*
ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి వచ్చింది.తను చేసిన తప్పులకు బాధ పడింది.ఎలాగైనా సుందరాన్ని క్షమించమని అడగాలనుకొంది. ఉగ్రానంద స్వామి వారి సహాయంతో సుందరం ఆత్మతో మాట్లాడ గలిగింది ,

" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"

" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "

"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "

"నేను బానే ఉన్నాను "

" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "

"నాకు ఇక్కడ చాలా బాగుంది "

" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "

" లేదు , నరకం అంధకూపం లో "

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం